సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ, మే 2: కొవిడ్ టీకా వేసుకోవాలని ఎవరినీ బలవంతం చేయొద్దని సుప్రీంకోర్టు పేర్కొన్నది. టీకా వేసుకొంటే వచ్చే దుష్పరిణామాలపై సమాచారాన్ని ప్రజలకు తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. వ్యాక్సిన్ వేసుకోని వారు బహిరంగ ప్రదేశాల్లో తిరగడంపై ఆంక్షలు విధించొద్దని సూచించింది.
కొవిడ్ కేసులు తక్కువగా ఉన్నన్ని రోజులు దీన్ని పాటించాలని తెలిపింది. కొవిడ్ టీకా వేసుకొంటే సైడ్ ఎఫెక్ట్స్పై సమాచారాన్ని బహిరంగపర్చాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ మాజీ సభ్యుడు జాకబ్ పులియేల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. పిల్లల వ్యాక్సిన్ల ట్రయల్స్ సమాచారాన్ని త్వరగా వెల్లడించాలని టీకా తయారీ సంస్థలను ఆదేశించింది.