న్యూఢిల్లీ : పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై సభలో సభ్యుల నిరసనల మధ్య 15 మంది విపక్ష ఎంపీలను ప్రభుత్వం సస్పెండ్ చేసిన క్రమంలో సస్పెన్షన్కు గురైన డీఎంకే ఎంపీ కనిమొళి (Kanimozhi) కాషాయ సర్కార్పై విరుచుకుపడ్డారు. కాషాయ పార్టీకి అసలు ప్రజాస్వామ్యం అర్ధం తెలుసా అంటూ ప్రశ్నించారు. పార్లమెంటేరియన్ల జవాబుదారీతనంలో బీజేపీ ద్వంద ప్రమాణాలు పాటిస్తోందని దుయ్యబట్టారు.
లోక్సభలో స్మోక్ దాడికి పాల్పడిన ఇద్దరు ఆగంతకులకు విజిటర్ పాస్లు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు. నిరూపణ కాని అవినీతి ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువ మొయిత్రను సభ నుంచి బహిష్కరించారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
బుధవారం నాటి ఘటనలో ప్రభుత్వ భద్రతా వైఫల్యంపై ప్రశ్నించడం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్టు ఎలా అవుతుందనేది తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. 15 మంది తమ ఎంపీలను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఆగంతకులకు పాస్లు జారీ చేసిన ఎంపీ ఇప్పటికీ సభలోనే ఉన్నారని చెప్పారు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో బీజేపీ అర్ధం చేసుకుందా అని కనిమొళి ప్రశ్నించారు.
Read More :