చెన్నై: డీఎంకే ఫైల్స్ పేరుతో తమిళనాడు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలైకి అధికార డీఎంకే ఝలక్ ఇచ్చింది. సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకే పార్టీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ, రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేసింది.
ఈ మేరకు ఆదివారం అన్నామలైకి లీగల్ నోటీసులు పంపింది. ‘డీఎంకే ఫైల్స్ పేరుతో అన్నామలై చేసిన ఆరోపణలు ఊహాజనితం. కుట్రపూరితం. తన రాజకీయ జీవితంలో అక్రమంగా ఎన్నడూ ఒక్క పైసా కూడా డీఎంకే నాయకుడు స్టాలిన్ తీసుకోలేదు. తరుచూ నిరాధార ఆరోపణలు చేస్తున్న అన్నామలై బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అని డీఎంకే డిమాండ్ చేసింది.