న్యూఢిల్లీ, డిసెంబర్ 5: డీఎంకే ఎంపీ సెంథిల్కుమార్ బుధవారం లోక్సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ మాట్లాడే ప్రాంతాలన్నీ ‘గోమూత్ర రాష్ర్టాలు’ అని, బీజేపీ అక్కడ మాత్రమే విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు.
దక్షిణాది రాష్ర్టాల్లో ఆ పార్టీ గెలవలేదని అన్నారు. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో సెంథిల్ కుమార్ క్షమాపణలు చెప్పారు.