చెన్నై : యూపీ, బీహార్ నుంచి వచ్చిన హిందీ మాట్లాడేవారు తమిళనాడులో టాయ్లెట్స్, రోడ్లను శుభ్రం చేయడంతో పాటు భవన నిర్మాణ పనుల్లో స్ధిరపడుతున్నారని డీఎంకే ఎంపీ (DMK MP) దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. డీఎంకే ఎంపీ వ్యాఖ్యలతో కూడిన వీడియోను బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా షేర్ చేశారు.
డీఎంకే ఎంపీ వ్యాఖ్యలను ఈ రెండు రాష్ట్రాల నేతల ఇండియా విపక్ష కూటమి నేతలు తప్పుపట్టకపోవడం సరైంది కాదని బీజేపీ నేత పేర్కొన్నారు. ఈ వైరల్ క్లిప్లో ఇంగ్లీష్ తెలిసిన వారు ఐటీ జాబ్స్లో కుదురుకుంటే హిందీ ఒక్కటే నేర్చుకున్నవారు చిన్నా చితకా పనులు చేస్తూ బతుకీడుస్తున్నారని ఈ వైరల్ క్లిప్లో మారన్ చెప్పుకొచ్చారు. మరోవైపు బిహార్ ప్రజలను అవమానించడం డీఎంకే నేతలు మానుకోవాలని పట్నా బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ హితవు పలికారు.
మీ ఇండియా కూటమిలో భాగస్వామి నితీష్ కుమార్ హయాంలో బిహార్ అభివృద్ధికి నోచుకోకపోవడంతోనే బిహారీలు తమిళనాడు వెళ్లాల్సిన దుస్ధితి నెలకొందని డీఎంకే నేతలను ఉద్దేశించి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇండియా కూటమి దేశ ప్రజలను ప్రాంతం, భాష, కులం ఆధారంగా విభజిస్తోందని బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. డీఎంకే ఎంపీపై ఇండియా కూటమి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గర్హనీయమని అన్నారు.
Read More :
California Temple | స్వామి నారాయణ్ ఆలయంపై దాడిని ఖండించిన అమెరికా