చెన్నై : హిందీ మాట్లాడేవాళ్లు ఉత్తర ప్రదేశ్, బీహార్ల నుంచి వచ్చి తమిళనాడులో భవన నిర్మాణం, టాయ్లెట్ల్ల క్లీనింగ్ వంటి చిల్లర పనులు చేసుకుంటారని డీఎంకే నేత దయానిధి మారన్ అన్నారు.
ఇంగ్లిష్ నేర్చుకున్నవారికి ఐటీలో మంచి ఉద్యోగాలు వస్తాయని, కేవలం హిందీ నేర్చుకున్నవారు రోడ్లు, మరుగుదొడ్లు శుభ్రం చేసుకుని జీవిస్తారని అన్నారు. కేవలం హిందీ మాత్రమే నేర్చుకుంటే జరిగేది ఇదేనని చెప్పారు. ఈ వీడియోను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ‘విభజించు-పాలించు’ సూత్రాన్ని మరోసారి అమలు చేయడం ప్రారంభించారని దుయ్యబట్టారు. మొదట కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉత్తరాది ఓటర్లను అవమానించారని అన్నారు.