చెన్నై: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. బీజేపీ దక్షిణ తూత్తుకూడి జిల్లా శాఖ అధ్యక్షుడు ఆర్ సిధ్రాంగథన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామన్నారు. ట్యుటికోరిన్ జిల్లాలోని తాండపథులో ఈ నెల 22న జరిగిన డీఎంకే కార్యకర్తల సమావేశంలో అనిత ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో ఆరోపించారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ను మోదీ ప్రశంసించారని, అందుకే అనిత అసభ్యకరంగా మాట్లాడారని సిథ్రాంగధన్ చెప్పారు. మరోవైపు తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.