బెంగళూర్ : 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం జరిగిన అల్లర్ల కేసులో హుబ్బలికి చెందిన వ్యక్తి అరెస్ట్ను బీజేపీ రాజకీయం చేస్తోందని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడే ప్రక్రియలో భాగంగానే అరెస్ట్ జరిగిందని తమ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడదని పేర్కొన్నారు.
తాము శాంతిని ప్రేమిస్తామని, కర్నాటకలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు చోటు లేదని స్పష్టం చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఈ క్రమంలో హుబ్బలికి చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని హోంమంత్రి ఈ విషయంలో ఇప్పటికే స్పష్టత ఇచ్చారని డీకే శివకుమార్ తెలిపారు. ఏడు నెలలుగా బీజేపీ విపక్ష నేతను ఎన్నుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు.
సార్వత్రిక ఎన్నికలు రానుండటంతో తాము రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నామని చాటుకునేందుకు బీజేపీ ఈ అంశాలను లేవనెత్తుతోందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని, వారే దీటుగా బదులిస్తారని అన్నారు. వారి లాగా తాము ఇతర పార్టల కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం లేదని డీకే శివకుమార్ పేర్కొన్నారు. బీజేపీ తన హయాంలో బెంగళూర్, హుబ్బలిలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలపై పెద్దసంఖ్యలో కేసులు బనాయించిందని ఆరోపించారు. తాము అలా ఎప్పుడూ చేయలేదని, భవిష్యత్లోనూ చేయబోమని డీకే శివకుమార్ వివరించారు.
Read More :
Zomato | పెట్రోల్ దొరకలేదు.. గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో బాయ్.. VIDEO