అఖిలేశ్ను కలిసిన బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలు
లక్నో: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే వరుస ఎన్నికల్లో ఓడిపోతూ దెబ్బతిన్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి తాజాగా ఆ పార్టీకి చెందిన బహిష్కృత ఎమ్మెల్యేలు మరో షాకిచ్చారు. ఐదుగురు బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలు.. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో మంగళవారం లక్నోలో సమావేశమయ్యారు. దీంతో వీరంతా ఎస్పీలో చేరనున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. అఖిలేశ్ను కలిసిన వారిలో ముంగ్రా-బాద్షాపూర్ ఎమ్మెల్యే సుష్మా పటేల్తో పాటు మహ్మద్ అస్లాం రైనీ, హకీం లాల్ బింద్, ముజ్తపా సిద్ధిఖి, హర్గోవింద్ భార్గవ్ ఉన్నారు. అఖిలేశ్తో సమావేశం అనంతరం సుష్మా మాట్లాడుతూ.. ‘యూపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై అఖిలేశ్తో 15-20 నిమిషాల పాటు చర్చించాం’ అని చెప్పారు. 403 మంది శాసనసభ్యులున్న యూపీ అసెంబ్లీలో బీఎస్పీకి 18 మంది ఎమ్మెల్యేలుండగా.. గతేడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డ్డారనే ఆరోపణతో ఏడుగురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్కు గురయ్యారు.