న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మించిన రామాలయాన్ని(Ayodhya Ram Temple) ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆ అంశంపై ఇవాళ లోక్సభలో చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాలకు ఇవాళే చివరి రోజు అయిన నేపథ్యంలో ఆ అంశాన్ని సభలో చర్చించాలని నిర్ణయించారు. ఈ చర్చలో తాము పాల్గొనడం లేదని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. సత్యపాల్ సింగ్, శ్రీకాంత్ ఏక్నాథ్ షిండేలు రామ్లల్లాపై సభలో చర్చను ప్రారంభించనున్నారు.