న్యూఢిల్లీ, జూన్ 23: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి దినకర్ గుప్తా నియమితులయ్యారు. 2024 మార్చి 31 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. దినకర్ నియామకానికి క్యాబినెట్ కమిటీ గురువారం ఆమోదం తెలిపింది.
మరోవైపు, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా (అంతర్గత భద్రత) స్వాగత్ దాస్ నియమితులయ్యారు. 2024 నవంబర్ వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. 1987 బ్యాచ్ ఛత్తీస్గఢ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన దాస్.. ప్రస్తుతం ఐబీలో స్పెషల్ డైరెక్టర్గా ఉన్నారు.