న్యూఢిల్లీ, మే 2: కాంగ్రెస్కు కంచుకోట అయిన యూపీలోని రాయ్బరేలీలో బీజేపీ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్ పేరును ఆ పార్టీ గురువారం ప్రకటించింది. కాగా, నామినేషన్ల తుది గడువుకు ఇంకా 24 గంటలే ఉన్నప్పటికీ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థిని కాంగ్రెస్ ఇంతవరకూ ప్రకటించ లేదు.
కాంగ్రెస్ మాజీ ఎంఎల్సీ అయిన దినేష్ ప్రతాప్ సింగ్ దేశ ప్రజలకు అంతగా తెలియక పోయినా యూపీ ప్రజలకు చిరపరిచితుడే. ఆయన 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ఈసారి అభ్యర్థి ఎవరైనా గెలుపు మాత్రం తనదేనంటూ దినేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమేథీలో అమలు చేసిన వ్యూహాన్నే రాయ్బరేలీలో కూడా అమలు చేయాలని బీజేపీ భావిస్తున్నది.