Dimple Yadav | ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి లోక్సభకు జరిగిన ఉపఎన్నికల్లో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ భారీ విజయం దిశగా సాగుతున్నారు. తన సమీప ప్రత్యర్థిపై ఆమె రెండు లక్షల ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ షక్య 2,10,063 ఓట్లు పోలవగా.. డింపుల్కు 4,10,751 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం ఓటింగ్ కొనసాగుతోంది.