Dilip Ghosh: ఈ నెల 30న పశ్చిమబెంగాల్లో భవానీపూర్తోపాటు మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలైన షంషేర్గంజ్, జాంగీర్పూర్కు ఉప ఎన్నికలు జరుగనుండటంతో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ వేడి రాజుకుంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి స్వయంగా బరిలో దిగనున్న భవానీపూర్ ఉపఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. బెంగాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కూడా భవానీపూర్ ఉపఎన్నికనే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య అప్పుడే మాటల యుద్ధం మొదలైంది. బీజేపీకి తమపై గెలిచే సత్తా లేదని మమతాబెనర్జి వ్యాఖ్యానించారు. మరోవైపు ఉప ఎన్నికల్లో అభ్యర్థులు ఎందరున్నా తమ ఓటర్లు మాత్రం తమతోనే ఉంటారని బీజేపీ ధీమా వ్యక్తంచేసింది. లెఫ్టఫ్రంట్ ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపినా, నిలుపకపోయినా పెద్దగా తేడా ఏమీ ఉండదని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ( Dilip Ghosh ) ఎద్దేవా చేశారు. ప్రధాన పోటీ తృణమూల్, బీజేపీ మధ్యే ఉంటుందని ఆయన చెప్పారు.