న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే ఇండియాలో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. డిజిటల్ రూపీని ప్రవేశపెట్టనున్నట్లు ఆమె చెప్పారు. ఇవాళ లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె ప్రసంగిస్తూ.. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా వినియోగించే డిజిటల్ రూపీని తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే 2022-23 సంవత్సరంలోనే ఆర్బీఐ ఆ డిజిటల్ రూపీని విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను డిజిటల్ రూపీ బలోపేతం చేస్తుందని మంత్రి నిర్మల తెలిపారు. డిజిటల్ కరెన్సీపై ఉన్న అపోహలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.