న్యూఢిల్లీ : తమిళనాడులోని కూనూర్ వద్ద ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. హెలికాఫ్టర్ ప్రమాదం నేపధ్యంలో రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ ఢిల్లీలో బిపిన్ రావత్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్లో బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య మధులిక రావత్ సహా 14 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కి పెరగ్గా ముగ్గురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన ప్రాంతానికి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి బయలుదేరారు. కాగా ఆర్మీ హెలికాఫ్టర్ బుధవారం సులూర్ నుంచి వెల్లింగ్టన్కు వెళుతుండగా కూనూర్ వద్ద కుప్పకూలింది. హెలికాఫ్టర్ కూలిన సమయంలో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమంచు అలుముకుంది. ప్రమాద ఘటనపై వాయుసేన దర్యాప్తునకు ఆదేశించింది.