న్యూఢిల్లీ: బీహార్పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆ రాష్ట్ర ఎంపీల నిరసనలతో దిగి వచ్చారు. బీహార్ను అవమానించే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సభ్యుడు మనోజ్ ఝా ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో మంగళవారం మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, రాజ్యసభా నాయకుడైన పీయూష్ గోయల్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన ఇదే మార్గంలో ఉంటే, మొత్తం దేశాన్ని బీహార్గా మారుస్తాడు’ అంటూ హేళన చేశారు.
కాగా, కేంద్ర మంత్రి పీయూష్ వ్యాఖ్యలపై ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝూ నిరసన వ్యక్తం చేశారు. బీహార్ను అవమానించడమేనని అన్నారు. ‘సార్ నా గురించి ఏదైనా అనండి. కానీ దయచేసి బీహార్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని వేడుకుంటున్నా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ ఎంపీలు కూడా ఘాటుగా స్పందించారు. బీహార్ను అవమానించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత రెండు రోజులుగా పార్లమెంట్ బయట, లోపల నిరసన వ్యక్తం చేశారు.
మరోవైపు ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధంఖర్కు ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝూ లేఖ రాశారు. బీహార్ను అవమానించేలా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని, భవిష్యత్తులో మరే కేంద్ర మంత్రి ఏ రాష్ట్రాన్ని కూడా అవమానించేలా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు పీయూష్ గోయల్ గురువారం రాజ్యసభకు తెలిపారు. అయితే ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని బీహార్ ఎంపీలు పట్టుబట్టారు.
देखिए,कैसे एक विवेकहीन व अहंकारी केंद्रीय भाजपाई मंत्री सदन के अंदर बिहार और बिहारियों का अपमान कर रहे है?
इनके गृह राज्य महाराष्ट्र से 2.5लाख करोड़ के प्रोजेक्ट्स गुजरात चले गए लेकिन बेचारे चूँ तक नहीं कर सके,यही इनकी हैसियत है।
बिहार BJP के नाकारा सांसदों ने जमीर बेच दिया है। pic.twitter.com/vPqozVUu1l
— Tejashwi Yadav (@yadavtejashwi) December 21, 2022