పన్నా, ఆగస్టు 28: అందరు రైతుల పొలాల్లో పంటలు పండుతాయి. ఈ రైతు పొలంలో వజ్రాలు పండుతాయి. మధ్యప్రదేశ్కు చెందిన ఓ రైతుకు తన పొలంలో ఏకంగా ఆరు వజ్రాలు దొరికాయి. పన్నా జిల్లాలో డైమండ్ రిజర్వ్ ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం గతంలో రైతులకు లీజుకు ఇచ్చింది. జారువాపూర్కు చెందిన రైతు ప్రకాశ్ మజుందార్కు కొంత పొలం దక్కింది. ఇందులో అతడు తన నలుగురు మిత్రులతో కలిసి వజ్రాల వేట మొదలు పెట్టాడు. రెండేండ్ల క్రితం తొలి వజ్రం దొరికింది. తాజాగా దొరికిన వజ్రం 6.47 క్యారట్ల బరువు ఉంది. దీనిని మజుందార్ అధికారులకు అప్పగించారు. దీని ధర రూ.30 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. త్వరలోనే వేలం వేస్తామన్నారు.