న్యూఢిల్లీ ; మధుమేహం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ఈ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో డయాబెటిస్పై సరైన అవగాహన కల్పించాలని సోమవారం ‘ప్రపంచ డయాబెటిస్ దినం’ సందర్భంగా డబ్ల్యూహెచ్వో పిలుపునిచ్చింది.