అయోధ్య: అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని ధర్నా చేసిన దళిత మహిళలపై యూపీ పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. కనిపించిన ప్రతి మహిళపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఇద్దరు, ముగ్గురు పోలీసులు కలిసి ఒక్కో మహిళను కొడుతూ తమ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ జిల్లా జలాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది.