Spice Jet | స్పైస్జెట్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బుధవారం షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించింది. గత కొద్ది రోజులుగా స్పైస్జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ మేరకు డీజీసీఏ లోపాలపై సమీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇంతకు ముందు ఈ నెల 6న సైతం విమానయాన సంస్థకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
జూన్ 19 నుంచి ఎనిమిది విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఫలితంగా విమానాలను దారి మళ్లించడం, అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రయాణికుల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ‘సాంకేతిక సమస్యల గుర్తింపు, తనిఖీలు, భద్రత మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని.. ఎనిమిది వారాల పాటు స్పైస్జెట్ కేవలం 50 శాతం విమానాలనే నడిపించాలని ఆదేశాలు జారీ చేసినట్లు డీజీసీఏ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. డీసీజీఏ నిర్ణయం స్పైస్జెట్ కార్యకలాపాలను ప్రభావితం చేయనున్నది.