న్యూఢిల్లీ : అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేదాన్ని నవంబర్ 30 వరకూ పొడిగించినట్టు పౌరవిమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) శుక్రవారం వెల్లడించింది. ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ విమానాలను సంబంధిత అధారిటీ ఆమోదంతో అనుమతిస్తారని డీజీసీఏ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ నియంత్రణలు అంతర్జాతీయ కార్గో ఆపరేషన్స్తో పాటు డీజీసీఏ ఆమోదించిన విమానాలకు వర్తించవని తెలిపింది. కాగా అంతకుముందు సెప్టెంబర్లో అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని డీజీసీఏ అక్టోబర్ 31 వరకూ పొడిగించింది.