బెంగళూరు: హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హాల్) తీసుకొస్తున్న 19 సీట్ల సామర్థ్యం గల పౌర విమానానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదం తెలిపింది. విమాన నిర్వహణ ఖర్చులను భారీగా తగ్గించుకోవడానికి, తక్కువ మంది ప్రయాణికులను వేగంగా గమ్యానికి చేర్చడానికి ఈ విమానం ఎంతగానో ఉపయోగపడనున్నదని హాల్ తెలిపింది.
ఈ విమానంలో 5,695 కిలోల బరువున్న వస్తువులను కూడా తీసుకెళ్లవచ్చని వెల్లడించింది. ఇలాంటి విమానం భారత్లో తయారు కావడం ఇదే తొలిసారిగా తెలుస్తున్నది.