డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి ( Kedarnath Temple ) భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతున్నది. గత కొన్ని రోజులుగా కేదార్నాథుని దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. 2013లో భారీ వరదలు మిగిల్చిన విషాదం తర్వాత భక్తుల సంఖ్య ఈ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారి అని ఆలయ అధికారులు చెబుతున్నారు. నాటి వరద విపత్తు అనంతరం ఈ పుణ్యక్షేత్రం వద్ద అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, అప్పటిలా వరదలు వచ్చినా ప్రాణనష్టం లేకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ మధ్యకాలంలో కేదార్నాథ్ పరిసరాల్లో పలు నిర్మాణ పనులు చేపట్టారని, దాంతో ఆకస్మిక వరదల భయం పోయిందని భక్తులు చెబుతున్నారు. పునర్నిర్మాణ పనులు పూర్తయితే ఆకస్మిక వరదలు వచ్చినా పెద్దగా ప్రమాదమేం ఉండదని అంటున్నారు.