Dress Code | పూరి: ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ఇకపై తప్పనిసరిగా డ్రెస్కోడ్ను పాటించాల్సిందే. జీన్స్, షార్టులు, స్కర్టులు, స్లీవ్లెస్ డ్రెసులు ధరిస్తే ఆలయంలోకి ప్రవేశం ఉండదు. ఈ నూతన నిబంధనలు జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ఆలయ పరిసరాల్లో ఎక్కువ మంది పురుషులు ధోతీలతో, మహిళా భక్తులు చీరలు, సల్వార్ కమీజ్లతో కనిపించారు.
ఆలయ విశిష్టతను కాపాడటానికి ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు అధికారులు చెప్పారు. ఆలయ పరిసరాల్లో గుట్కా, పాన్ మసాలాలు, ప్లాస్టిక్ సంచులను నిషేధించినట్టు వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.