ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ప్రయాణించారు. (Fadnavis And Uddhav) శుక్రవారం వారిద్దరూ ముంబై నుంచి నాగ్పూర్కు విమానంలో కలిసి ప్రయాణించడం రాజకీయ చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే దీనిపై స్పందించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చాలా తెలివైన వ్యక్తి అని, కుట్రలు పన్నే స్నేహితుడు ఎంత ప్రమాదకరమో ఆయనకు బాగా తెలుసని అన్నారు.
కాగా, 2019లో బీజేపీ, అవిభక్త శివసేన ఒకే విమానంలో ప్రయాణించాయని, అయితే అప్పుడు ఆయన (ఉద్ధవ్) వేరే విమానంలో ప్రయాణించి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారని ఏక్నాథ్ షిండే ఆరోపించారు. ఆరుగురు తిరుగుబాటు పార్టీ ఎంపీల నియోజకవర్గాల్లో ఉద్ధవ్ ఠాక్రే సభలు నిర్వహించడంపై కూడా ఆయన స్పందించారు. శివసేన (యూబీటీ) అధినేతను ఇంటి నుంచి బయటకు రప్పించిన ఘనత తనదేనని షిండే అన్నారు.
మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థి దేవేంద్ర ఫడ్నవిస్తో కలిసి విమానంలో ప్రయాణించడంపై ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. తామిద్దరం చాలా ఉన్నత స్థాయిలో చర్చలు జరిపినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో దాని ఫలితం తెలుస్తుందని ఠాక్రే అన్నారు.
అయితే ఫడ్నవీస్, ఉద్ధవ్ కలిసి ఒకే విమానంలో ప్రయాణించడంలో ఎలాంటి రాజకీయ ప్రాముఖ్యత లేదని బీజేపీ కొట్టిపారేసింది. పార్టీలకు అతీతంగా స్నేహపూర్వక, వ్యక్తిగత సంబంధాలను నాయకులు కొనసాగిస్తారని పేర్కొంది.