న్యూఢిల్లీ, మార్చి 15: అటవీ హక్కుదారులు అయిన వారి సామాజిక, ఆర్థిక పురోగతికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొంటూ ఆయా రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది.
విద్య, వైద్యం, మంచినీటి వసతి తదితర మౌలిక సదుపాయాల కల్పనకు అటవీ హక్కుల చట్టం (ఎఫ్ఆర్ఏ), 2006ను సక్రమంగా అమలు చేయటానికి సమగ్ర మార్గదర్శకాలను కేంద్రం లేఖలో పేర్కొన్నది. ఈ మేరకు అన్ని రాష్ర్టాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు సంయుక్తంగా లేఖలు రాసింది.