బెంగళూరు, అక్టోబర్ 12: వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమకు ఓటేసిన గ్రామాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెస్సీ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. బీజేపీ, జేడీఎస్ జట్టుకట్టడంపై ఆయన స్పందిస్తూ.. అది కాంగ్రెస్కే లాభిస్తుందన్నారు.
‘మా ప్రబుత్వం మరో ఐదేండ్లు అధికారంలో ఉంటుంది. మాకు ఓటేసిన గ్రామాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం’ అని స్పష్టంచేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం బొమ్మై స్పందిస్తూ.. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులే లేవని.. ఇది సున్నా నిధుల ప్రభుత్వమని విమర్శించారు.