న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ఇవాళ రాజ్యసభలో నవ్వులు పూయించారు. రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న నేపథ్యంలో.. సభలో వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సభలో జరిగిన అంశాలను ప్రస్తావించారు. తన రాజకీయ జర్నీ గురించి కొంత వివరించారు. ప్రస్తుత కాలపరిమితి ముగియడంతో.. మాజీ ప్రధాని దేవగౌడ, ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా వీడ్కోలు తీసుకుంటున్నారు. అయితే ఖర్గే తన ప్రసంగంలో దేవగౌడతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. దేవగౌడ గతంలో దేశ ప్రధానిగా చేశారని, ఎన్నో కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించారని, ఆయన గత 54 ఏళ్లుగా తనకు పరిచయం ఉందని, ఆయనతో కలిసి పనిచేసినట్లు ఖర్గే తెలిపారు. అయితే ఏం జరిగిందో ఏం తెలియదు కానీ, తమతో డేటింగ్ చేసి, తమను ప్రేమించిన అతను.. ప్రధాని మోదీని పెళ్లి చేసుకున్నారని అన్నారు. దీంతో సభలోని సభ్యులందరూ నవ్వేశారు. అక్కడే ఉన్న ప్రధాని మోదీ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.
1996 లోక్సభ ఎన్నికల తర్వాత ఓ ఏడాది కాలం పాటు ప్రధానిగా దేవగౌడ చేశారు. యూనైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఆ ఫైట్లో ఆ కూటమి గెలిచింది. హెచ్డీ కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ 2019లో ఆ ప్రభుత్వం కూలింది. ఆ తర్వాత బీజేపీతో జేడీఎస్ జతకట్టిన విషయం తెలిసిందే. ఖర్గే తన ప్రసంగంలో మాట్లాడుతూ.. శరద్ పవార్, తిరుచ్చి శివతోనూ తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. అయితే ఆ ఇద్దరీ మళ్లీ రాజ్యసభలోకి ఎంటర్కానున్నారు. కేంద్ర మంత్రి అత్వాలే గురించి ప్రస్తావిస్తూ.. ఆయన తన పద్యంలోని ప్రధాని మోదీని మెచ్చుకుంటారని, ఇక ఆయనకు మరో పద్యం రాదు అని అన్నారు. దీంతో సభ్యులు నవ్వుకున్నారు.
VIDEO | Parliament Session: Congress president Mallikarjun Kharge in Rajya Sabha, says, “I have known H D Deve Gowda for decades, but I don’t know what happened recently. He expressed love for us, but married PM Modi’s party.”#ParliamentSession #RajyaSabha
(Source: Third… pic.twitter.com/8nfXsANqI6
— Press Trust of India (@PTI_News) March 18, 2026