న్యూఢిల్లీ, మే 26: ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను జైలు అధికారులు దవాఖానకు తరలించారు. సాయిబాబా నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. తన జైలు గదిలో ఉన్న సీసీటీవీ కెమెరాను తొలగించాలని ఆయన నిరాహార దీక్షను చేపట్టారు. బాత్రూంకు వెళ్లినా, స్నానం చేసినా సీసీటీవీలో రికార్డు చేయడం జీవించే హక్కుకు భంగం కలిగించడమేనని వాదించారు. సాయిబాబా ఆరోగ్యం నిరాహార దీక్షతో బాగా క్షీణించింది. అయితే, సీసీటీవీ కెమెరాను తొలగించడానికి బదులు దాని దిశను మారుస్తామని జైలు అధికారులు పేర్కొన్నారు.