న్యూఢిల్లీ : తన ఆశ్రమంలో బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన ఆరోపణలపై జైలు జీవితం గడుపుతున్న డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్కు గురువారం 30 రోజుల పెరోల్ మంజూరైంది. ఈ ఏడాది జనవరిలో పెరోల్పై బయటకు వచ్చిన డేరా బాబాకు మరోసారి హరియాణ ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసింది.
పెరోల్ సమయంలో యూపీలోని బాగ్పట్ జిల్లాలోని షా సత్నం ఆశ్రమంలో డేరా బాబా నివసిస్తారు. సిర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు మహిళా శిష్యురాళ్లపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో డేరా బాబా రోహ్తక్ జైలులో 20 ఏండ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు.
పంజాబ్, హరియాణ, హిమాచల్ ప్రదేశ్, యూపీ వంటి రాష్ట్రాల్లో పెద్దసంఖ్యలో భక్తగణం కలిగిన డేరా బాబాకు ఇప్పటివరకూ ఐదు సందర్భాల్లో పెరోల్స్ లభించాయి. ఇక పెరోల్ వ్యవధిలో రిలీజ్ వారెంట్లో పొందుపరచని ఏ ప్రాంతానికైనా వెళ్లేముందు జిల్లా మెజీస్ట్రేట్ అనుమతి తప్పనిసరి వంటి పలు షరతులతో గుర్మీత్ సింగ్కు పెరోల్ మంజూరైంది.
Read More :
Apple GPT AI | చాట్జీపీటీ, గూగుల్ బార్డ్కు దీటుగా త్వరలో యాపిల్ జీపీటీ ఏఐ