Lucknow | వచ్చే ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. 172 సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల విషయంపై చర్చలు జరిగాయని, టిక్కెట్ల పంపిణీపై కూడా చర్చించామని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో తాము విజయం సాధిస్తామని పేర్కొన్నారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచే బరిలోకి దిగనున్నారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసింది. మరో మూడు రోజుల్లో బరిలోకి దిగబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని మౌర్య తెలిపారు.
మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోతున్న నేపథ్యంలో అధిష్ఠానం అల్టర్ అయ్యింది. దీనిని పూడ్చుకోవడానికి శతధా ప్రయత్నిస్తూనే వుంది. ప్రస్తుతం తలెత్తిన విపత్తును అప్నాదళ్, నిషాద్ పార్టీలతో జట్టు కట్టేందుకు బీజేపీ సిద్ధపడిపోయింది. కేంద్ర హోం మంత్రి అమిత్షా ఇప్పటికే ఈ రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో సమాలోచనలు కూడా జరిపారు. అనుప్రియా పటేల్, సంజయ్ నిషాద్తో చర్చలు చేశారు. అప్నాదళ్కు 14 సీట్లు, నిషాద్ పార్టీకి 13 నుంచి 17 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ రెడీ అయిపోయింది.