పాట్నా: విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు ఆలస్యంగా వచ్చారు. వారిని లోనికి అనుమతించకపోవడంతో గేటు వద్ద రచ్చ రచ్చ చేశారు. (Students Create Ruckus) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రానికి అర గంట ముందుగా రావాలని విద్యార్థులకు అధికారులు సూచించారు.
కాగా, శుక్రవారం పలు ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో వారిని లోనికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు రచ్చ చేశారు. గేట్లను తోసుకుని బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు.
మరోవైపు కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు రాళ్లు రువ్వడంతోపాటు హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. గోడలు దూకి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీహార్లోని చప్రా, భాగల్పూర్, ముజఫర్పూర్ వంటి పలు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Students tried to enter the exam centre for 12th Boards after 9 o’clock in Bihar.
— Cow Momma (@Cow__Momma) February 2, 2024