జైపూర్: రాజస్థాన్లోని చురు ఎంపీ రాహుల్ కస్వాన్ (Rahul Kaswan)కు బీజేపీ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో దేవేంద్ర ఝఝారియాకు టికెట్ కేటాయించింది. దీంతో బీజేపీ ఎంపీ రాహుల్ కస్వాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. కొంత సేపటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, గోవింద్ సింగ్ దోతస్రా తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, దీనికి ముందు రాహుల్ కస్వాన్ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. తన ప్రజా జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‘రాజకీయ కారణాల వల్ల, ఈ రోజు ఈ క్షణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా’ అని పేర్కొన్నారు. అలాగే చురు లోక్సభ నియోజకవర్గం ప్రజలకు పదేళ్లపాటు సేవ చేసే అవకాశం కల్పించిన బీజేపీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలియజేశారు.
#WATCH | Delhi: After joining Congress, Rahul Kaswan says, “I am grateful to Congress National President Mallikarjun Kharge, Sonia Gandhi and Rahul Gandhi along with Rajasthan Congress chief Govind Singh Dotasra and Party’s state incharge Sukhjinder Singh Randhawa. I am thankful… pic.twitter.com/SN4xYLYyra
— ANI (@ANI) March 11, 2024