న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో డెంగ్యూ కేసులు స్థిరంగా నమోదు అవుతున్నట్లు ఎల్ఎన్జేపీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల్లో కేసుల సంఖ్య తగ్గనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని, దీంతో దోమల బ్రీడింగ్ కూడా తగ్గుతుందన్నారు. ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో ఇప్పటి వరకు 38 మంది డెంగ్యూ పేషెంట్లు చేరినట్లు ఆయన తెలిపారు. వాయు కాలుష్యం పెరిగినప్పుడు.. ఆ సమయంలో కరోనా వైరస్తో పాటు అన్ని వైరస్లు ఎక్కువ సమయం వాతావరణంలో ఉంటాయన్నారు. చాలా తేలికైన మూడు లేయర్ల మాస్క్ వల్ల 65 నుంచి 95 శాతం రక్షణ ఉంటుందన్నారు. దివాళీ తర్వాత ప్రతి రోజు 5 మంది పిల్లల వరకు తమ హాస్పిటల్లో చేరుతున్నారని, అలర్జీ, ఆస్తమా, శ్వాసకోస సమస్యలతో వాళ్లు చేరుతున్నట్లు డాక్టర్ సురేశ్ కుమార్ చెప్పారు.