Lok Sabha Elections | న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లకు డిమాండ్ 40% మేరకు పెరిగింది. దీనివల్ల ఆపరేటర్లకు సుమారు 15-20% అధిక ఆదాయం లభించనుంది. ఈ రంగంలోని నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, చార్టర్డ్ సర్వీసులకు గంటకు కొంత నిర్ణీత మొత్తాన్ని వసూలు చేస్తారు. ఈ ధరలు కూడా పెరిగిపోయాయి. విమానానికి గంటకు రూ.4.5 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. రెండు ఇంజిన్ల హెలికాప్టర్కు గంటకు రూ.1.5 లక్షల నుంచి రూ.1.7 లక్షల వరకు తీసుకుంటున్నారు.
హెలికాప్టర్లకు సాధారణ రోజుల్లో ఉండే డిమాండ్ కన్నా ఎన్నికల సమయంలో దాదాపు 25% డిమాండ్ పెరిగింది. అయితే డిమాండ్కు సరిపడినన్ని విమానాలు, హెలికాప్టర్లు అందుబాటులో లేవని రోటరీ వింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ (వెస్టర్న్ రీజియన్) కెప్టెన్ ఉదయ్ గెల్లి చెప్పారు. చార్టర్డ్ విమానాలకు మునుపటి ఎన్నికల కంటే ఈసారి 40 శాతం డిమాండ్ పెరిగిందని బిజినెస్ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఎండీ కెప్టెన్ ఆర్కే బాలి తెలిపారు.