న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నుంచి అక్టోబర్లో జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపిన కొవిడ్-19 నమూనాల్లో 99శాతం డెల్టా వేరియంట్కు పాజిటివ్గా ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వ డేటా తెలిపింది. ఇండియన్ సార్స్-కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) ఏర్పాటైన నాటి నుంచి ఢిల్లీ నుంచి 7,361 నమూనాలను సీక్వెన్సింగ్ కోసం పంపారు. ఇందులో 2,873 నమూనాల్లో ‘డెల్టా వేరియంట్’ ఉందని ప్రభుత్వ డేటా తెలిపింది.
అక్టోబర్లో 99శాతం, సెప్టెంబర్లో 97శాతం, ఆగస్ట్లో 86శాతం, జూలైలో 52శాతం శాంపిల్స్లో డెల్టా వేరియంట్ను గుర్తించినట్లు జీనోమ్ సీక్వెన్సింగ్ డేటా వెల్లడించింది. ఏప్రిల్, మే నెలల్లో కరోనా సెకండ్ వేవ్ గరిష్ఠ స్థాయికి చేరిన సమయంలో సీక్వెన్సింగ్కు పంపినప్పుడు నమూనాల్లో వరుసగా 54శాతం, 82శాతం డెల్టా వేయింట్ను నమూనాల్లో గుర్తించారు. ప్రస్తుతం మళ్లీ డెల్టా వేరియంట్ ఏవై.4 సబ్ లినేజీ ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా.. ఇటీవల ఢిల్లీ ఆరో సెరో నివేదిక విడుదలైంది. ఇందులో ఢిల్లీలో 90శాతం మందిలో కరోనాకు వ్యతిరేకంగా ప్రజలు యాంటీబాడీలు కలిగి ఉన్నారని తేలింది. పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ సెరో పాజిటివిటీగా ఉన్నట్లు వెల్లడైంది. ఢిల్లీని ప్రతి జిల్లాల్లో 85శాతానికిపైగా సెరో పాజిటివిటీ రేటును గుర్తించారు. దేశంలో సెకండ్ వేవ్ తర్వాత ఢిల్లీలో నిర్వహించిన మొదటి సెరో సర్వే ఇదే.