శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజనను తప్పకుండా చేపడుతామని కేంద్రహోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం రాష్ట్రహోదాను పునరుద్ధరిస్తామన్నారు. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను 2019 ఆగస్టులో రద్దు చేసిన తర్వాత షా తొలిసారిగా శనివారం కశ్మీర్లో పర్యటించారు. ఈ సందర్భంగా భద్రతాదళాల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.