న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఢిల్లీలోని పటియాలా హౌస్కోర్టు ఊరట కల్పించింది. ప్రస్తుతం తాత్కాలిక బెయిల్పై ఉన్న ఆమె.. తన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ కోసం లాయర్ ప్రశాంత్ పాటిల్తో కలిసి కోర్టుకు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు ఆమె తాత్కాలిక బెయిల్ గడువును నవంబర్ 10 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నది.
అదేవిధంగా జాక్వెలిన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణను కూడా నవంబర్ 10న జరపనున్నట్లు తెలిపింది. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ సహా పలువురి ప్రమేయం ఉన్న రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ నిందితురాలిగా ఉంది. కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే పలుమార్లు ఆమెను ఇంటరాగేట్ చేసి ఆస్తులను జప్తుచేసింది.
తాత్కాలిక బెయిల్పై ఉన్న జాక్వెలిన్ ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నది. సుకేశ్ చంద్రశేఖర్ నుంచి ఆమె కోట్ల రూపాయల విలువైన వస్తువులను గిఫ్ట్లుగా అందుకున్నట్లు ఈడీ విచారణలో తేలింది. అందుకే ఆమెకు చెందిన రూ.7 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కానీ, జాక్వెలిన్ మాత్రం ఆ సొమ్ము తన కష్టార్జితమని చెబుతున్నది.
#WATCH | Actor Jacqueline Fernandez arrives at Delhi’s Patiala House Court in connection with her regular bail plea over the Rs 200 crore money laundering case involving conman Sukesh Chandrashekar pic.twitter.com/1odhntu1R4
— ANI (@ANI) October 22, 2022