న్యూఢిల్లీ : ఢిల్లీలోని జాతీయ జంతు ప్రదర్శన శాల ప్రత్యేక సందర్భాల కోసం జంతువులను అద్దెకు ఇవ్వనుంది. ఈ సంవత్సరం మార్చి నుంచి ఇది అమలు కానుంది. ప్రజలకు వన్యప్రాణుల పట్ల అనురాగాన్ని పెంచేందుకు, వాటి సంరక్షణకు అవసరమైన నిధులను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం జంతువుల పరిమాణం, వాటి పోషణకు అయ్యే ఖర్చును బట్టి ధరను నిర్ణయించారు.
ఒక రోజుకు జింక, ఎలుగుబంటికి రూ.500, పులికి రూ.50 వేలు అద్దెగా నిర్ణయించారు. ఈ అద్దె పథకంలో అద్దె జంతువుతో కలిసి ఫొటోలు తీసుకోవచ్చు. అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని పొందొచ్చు. జంతువుల అద్దెదారుల పేరు జూలోని డిజిటల్ స్క్రీన్పై ప్రదర్శిస్తారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా జంతువుల అద్దె కోసం బుకింగ్ చేసుకోవాలి.