న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు నాణ్యత రోజురోజుకు క్షీణిస్తున్నది. గత నాలుగు రోజులుగా నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 పైనే ఉంటున్నది. తాజాగా ఆదివారం ఉదయం ఏఐక్యూ 350గా నమోదయింది. మరికొన్ని ప్రాంతాల్లో 4 వందలు దాటిపోయింది. అత్యధికంగా ఆనంద్ విహార్లో ఏఐక్యూ 469గా ఉండగా, వజీర్పూర్లో 417, ముండ్కాలో 392, ఢిల్లీలో 385, ఆర్కే పురంలో 376, ఐటీఓ వద్ద 374, ఓఖ్లా ఫేజ్-2 వద్ద 370గా గాలి నాణ్యత నమోదయింది.
Delhi's overall air quality in the 'very poor' category, AQI at 350 this morning; visuals from ITO and India Gate C-Hexagon pic.twitter.com/JkfpvSSwos
— ANI (@ANI) October 30, 2022
వాయు ప్రమాణాలు పడిపోతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కోసమయంలో శ్వాస తీసుకోవడానికి కూడా వీలవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఈనేపథ్యంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఎన్సీఆర్లో చర్యలకు ఉపక్రమించడంతో పాటు ప్రజలకు కీలక సూచనలు చేసింది. వీలైనంత వరకు ఉద్యోగాలు ఇంటి నుంచి పని చేయాలని, వాయు కాలుష్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.
ఎంపిక చేసిన సేవలు మినహా అన్ని విభాగాల్లో నిర్మాణ పనులుపై నిషేధం విధించింది. రైల్వే స్టేషన్లు, మెట్రో, దవాఖానలు, విమానాశ్రయాలు తదితర విభాగాలను ఆంక్షల నుంచి సడలించింది. ప్రజలు రవాణా కోసం షేరింగ్ వాహనాలను ఉపయోగించాలని కమిషన్ విజ్ఞప్తి చేసింది. సైకిల్స్ను వినియోగించాలని, వీలైనంత వరకు ఇంట్లో నుంచి పని చేసుకోవాలని కోరింది.