న్యూఢిల్లీ : ఢిల్లీలో కొవిడ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేసి, ఆంక్షలు సడలించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేజ్రీవాల్ మూడు ప్రతిపాదనలతో ఢిల్లీ లెఫ్టినెంట్ గర్నవర్కు శుక్రవారం లేఖ రాయగా.. ఎల్జీ సీఎం ప్రతిపాదనలు తిరస్కరించారు. మూడు ప్రతిపాదనల్లో ఒకదానికి మాత్రమే ఆమోదం తెలిపారు. ఢిల్లీలో అన్ని ప్రైవేటు కార్యాలయాలను 50శాతం సామర్థ్యంతో పని చేసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు.
మొన్నటి భారీగా పెరిగిన కరోనా కేసుల మధ్య వారాంతపు కర్ఫ్యూ విధించడంతో పాటు మార్కెట్లను బంద్ చేయగా.. దుకాణాలను సరి – బేసి విధానంలో అనుమతి ఇచ్చారు. ప్రైవేటు కార్యాలయాలను మూసివేసి, వర్క్ఫ్రం హోం అమలు చేశారు. ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆంక్షలు సడలించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దుకాణాలు నెల రోజుల్లో కేవలం పది రోజులు మాత్రమే పని చేస్తున్నాయని దుకాణదారులు వాపోతున్నారు. సీఎం ప్రతిపాదనలను ఎల్జీ తిరస్కరించిన నేపథ్యంలో నైట్కర్ఫ్యూతో పాటు మిగతా ఆంక్షలు కొనసాగనున్నాయి.