న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు దీనిపై తాజాగా మళ్లీ విచారణ జరిపి 4 నెలల్లో మెరిట్ ఆధారంగా కేసు విచారించాలని ఆదేశించింది.
అయి తే ఈ కేసును గతంలో తీర్పు ఇచ్చిన బెంచ్ కాకుండా మరొక బెంచ్లో విచారణ జరుపాలని జస్టిస్లు ఎంఆర్ షా, సీటీ రవికుమార్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రొఫెసర్ సాయిబాబా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు మావోయిస్టులతో సంబంధాలు నెరిపారన్న ఆరోపణలతో కేంద్రం ఆయనను అరెస్ట్ చేసింది.