Traffic Jam | జాతీయ రాజధాని ఢిల్లీలో భారీ ట్రాఫిక్ జామ్తో వాహనదారులు నరకం చూస్తున్నారు. రైతుల ఛలో ఢిల్లీ నేపథ్యంలో పోలీసులు సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘాజీపూర్, నోయిడా, బాదల్పూర్, గురుగ్రామ్, సింగు, టిక్రీ సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్, జంతర్మంతర్ వద్ద నిరసన తెలుపుతామని రైతులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలోని 29 సరిహద్దులను భద్రతా బలగాలు దిగ్బంధించాయి.
రైతులు రాకుండా బారికేడ్లు వేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో భారీగా వాహనాలు సరిహద్దుల్లో పేరుకుపోతున్నాయి. మరో వైపు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. హర్యానా, పంజాబ్, హిమాచల్ప్రదేశ్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం వాహనాలను మళ్లించినట్లు తెలిపారు. రైతుల ఆందోళన నేపథ్యంలో సింగు సరిహద్దు నుంచి 44వ నెంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
ముఖ్యంగా టిక్రీ సరిహద్దు వద్ద ట్రాఫిక్ స్తంభించింది. టిక్రీ సరిహద్దుల్లో పోలీసులు భారీగా నిఘా ఉంచారు. భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. రైతుల ఉద్యమం నేపథ్యంలో ఢిల్లీలోని సింగు సరిహద్దును పూర్తిగా మూసివేశారు. పంజాబ్-హర్యానా శంభు సరిహద్దులో నిరసనకారులు రాళ్లు రువ్వడం.. భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరో వైపు ఢిల్లీ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల 13న రికార్డు స్థాయిలో జనం ప్రయాణించారు. 71.90లక్షల మంది ప్రయాణంతో సెప్టెంబర్ 2023లో నమోదైన రికార్డును తిరగరాసింది.
VIDEO | Heavy traffic jam witnessed on Delhi-Gurugram Expressway as police put up barricades in view of farmers’ ‘Delhi Chalo’ march.#TrafficJam #Gurugram pic.twitter.com/RRm6L6ATKf
— Press Trust of India (@PTI_News) February 14, 2024