Bomb Threat | ఢిల్లీ (Delhi )లోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సాదిక్ నగర్ ( Sadiq Nagar) లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ (Indian Public School) ఆవరణలో బాంబు పెట్టినట్లు ఉదయం 10: 49 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం.. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించారు.
బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్వ్కాడ్కు (bomb detection and disposal squad) సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని సోదాలు చేపట్టగా.. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Viral News | ఎలుకను చంపిన కేసు.. నిందితుడిపై 30 పేజీల చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు
Keshub Mahindra | వృద్ధ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత
India Corona | వార్నింగ్ బెల్స్.. ఒక్కరోజులో 7 వేలకు పైనే కొత్త కేసులు