న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని LNJP హాస్పిటల్ రెసిడెంట్ డాక్టర్లు NEET పీజీ కౌన్సెలింగ్ జాప్యంపై శుక్రవారం నిరసన చేపట్టారు. counselling వేగంగా జరుపుతామని ఎప్పుడూ నోటి హామీ ఇస్తారంటూ మండిపడ్డారు. నీట్ పీజీ కౌన్సెలింగ్ ఇప్పటికే మూడు, నాలుగు సార్లు ఆలస్యమైందని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. కాగా, కౌన్సెలింగ్ షెడ్యూల్ కోసం తాము పదేపదే డిమాండ్ చేస్తున్నామని రెసిడెంట్ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రతీక్ గోయల్ తెలిపారు. అయినప్పటికీ నీట్ పీజీ కౌన్సెలింగ్ నిర్వహించడంలేదని విమర్శించారు.