న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది. బుధవారం రికార్డుస్థాయిలో 5,506 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 20 మంది మరణించారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,90,568కు, మరణాల సంఖ్య 11,133కు చేరింది. బుధవారం 90 వేలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించారు.
మరోవైపు ఢిల్లీలో 3,363 కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 6,59,980కి పెరిగింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 19,455కు చేరింది.