Delhi | దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. శనివారం ఉదయం 23.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం 8:30 గంటల సమయంలో తేమ శాతం 52 శాతంగా నమోదైందని తెలిపింది. ఇక శనివారం గరిష్ఠంగా 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఉదయం 8 గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత సూచికలో 177 రీడింగ్ నమోదైంది. ఈ విషయాన్ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెల్లడించింది.