న్యూఢిల్లీ, జనవరి 6: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్పై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులు శనివారం స్థానిక కోర్టును కోరారు. బ్రిజ్భూషణ్పై అభియోగాలు మోపడంపై పోలీసుల వాదనలు ముగిశాయి. ఆరోపించిన ఘటనల్లో కొన్ని విదేశాల్లో జరిగినందున.. అవి ఢిల్లీలోని కోర్టుల పరిధిలోకి రావన్న నిందితుల వాదనను పోలీసులు తిరస్కరించారు.
బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపిస్తున్న ఘటనలు ఢిల్లీ, దేశంలో లేదా విదేశాల్లో ఎక్కడ జరిగినా, అవి ఒకే నేరానికి సంబంధించినవని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ జరిపేందుకు ఢిల్లీ కోర్టుకు అధికార పరిధి ఉన్నదని పేర్కొన్నారు. వాదనల అనంతరం తదుపరి విచారణను కోర్టు జనవరి 20కి వాయిదా వేసింది.