న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్పై (Brij Bhushan) ఢిల్లీ పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. రోజ్ అవెన్యూ కోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ సింగ్ రెజ్లర్లను బెదిరించారని, వారిని మౌనంగా ఉండాలని హెచ్చరించారని కోర్టుకు నివేదించారు.
మీరు రెజ్లింగ్లో కొనసాగదలుచుకుంటే మౌనంగా ఉండండి..మీ కెరీర్ను నేను ఎలాగైతే తీర్చిదిద్దగలనో దాన్ని నాశనం కూడా చేయగలనని మహిళా రెజ్లర్లను ఉద్దేశించి బ్రిజ్ భూషణ్ బెదిరించాడని ఢిల్లీ పోలీసుల తరపు న్యాయవాది అతుల్ శ్రీవాస్తవ కోర్టుకు తెలిపారు. బ్రిజ్ భూషణ్ బెదిరింపులు ఐపీసీ సెక్షన్ 506 కింద నేర స్వభావాన్ని వెల్లడిస్తున్నాయని అన్నారు. మరో మహిళా రెజ్లర్ ఫిర్యాదు స్టేట్మెంట్ ప్రకారం బ్రిజ్ భూషణ్ ఆమెను ఉద్దేశించి ఈ ధోతీ కుర్తా డ్రెస్లో నేను ఎలా కనిపిస్తున్నానని అడిగాడని తెలిపారు.
ఓ యువతిని ఇలా అడగవచ్చా అని ఢిల్లీ పోలీసుల తరపు న్యాయవాది కోర్టును ప్రశ్నించారు. సహ నిందితుడు, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అసిస్టెంట్ కార్యదర్శి వినోద్ తోమర్ కార్యాలయంలోకి కేవలం మహిళలనే అనుమతిస్తారని, ఆపై తోమర్ కార్యాలయ తలుపులు మూసివేస్తారని, పురుష రెజ్లర్లను లోపలికి రాకుండా అడ్డుకుంటారని ఇదే వారి ఉద్దేశాన్ని వెల్లడిస్తోందని శ్రీవాస్తవ కోర్టుకు తెలిపారు.
Read More :
Janhvi Kapoor | శ్రీవారి సేవలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్